Latest Updates

  ➤ View More »  

Online Tests(Quizes) for SSC Students

  ➤ View More »  



  ➤ View More..  


  ➤ View More..  

3 May 2014

Only 9 Papers in SSC (10th Class) Examinations

పదో తరగతిలో 9 పేపర్లు ! (SOURCE)
  1.  విద్యాశాఖ సంస్కరణల ప్రతిపాదనల్లో మార్పులు
  2.  భాషలకు ఒకటి.. సబ్జెక్టులకు రెండు పేపర్లు
  3.  35 శాతం మార్కులు సాధిస్తే పాస్
  4.  9వ తరగతిలోనూ అదే విధానం
  5.  వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు!
 వచ్చే విద్యా సంవత్సరంలో (2014- 15) తొమ్మిది పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ మార్పులు చేస్తోంది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా.. వాటిని 7 పేపర్లుగా (అన్నీ ఒక్కో పేపరు, సైన్స్‌లో 2 పేపర్లుగా) చేయాలని మొదట్లో ప్రతిపాదనలు రూపొందించింది. అయితే ఇటీవల వివిధ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం సంస్కరణల ప్రతిపాదనల్లో పలు మార్పులు చేస్తోంది. ముఖ్యంగా 9 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనే ఆలోచనకు వచ్చింది. భాష(ప్రథమ, ద్వితీయ, తృతీయ)లు ఒక్కో పేపరుగా, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు రెండు పేపర్లుగా పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదనలు చేస్తోంది.


అంతేకాదు పదో తరగతికి ముందే విద్యార్థులు ఈ పరీక్ష విధానానికి అలవాటు పడాలనే ఉద్దేశంతో 9వ తరగతిలోనూ ఈ సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) భావిస్తోంది. పాస్ మార్కులు 40 శాతం కాకుండా 35 శాతమే ఉండేలా మార్పులు చేస్తోంది. వీటిపై ఈనెల 3న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించి నిర్ణయానికి రానుంది. ఆ తరువాత ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేలా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2 తరువాత ఏర్పడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వీటి అమలుపై తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

ఇదీ పేపర్ల స్వరూపం, మార్కుల విధానం..
  1.  సైన్స్‌లో జీవశాస్త్రం ఒక పేపరుగా, భౌతిక, రసాయన శాస్త్రాలకు మరో పేపరు ఉంటాయి.
  2. సాంఘిక శాస్త్రంలో భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రాలకు పేపరు-1, పౌరశాస్త్రం, చరిత్రలకు పేపరు-2 ఉంటాయి.
  3. గణితంలో సంఖ్యలు, సమితులు, బీజగణితం, ప్రోగ్రెషన్, కోఆర్డినేట్ జామెట్రీ పేపరు-1గా, జామెట్రీ, త్రికోణమితి, క్షేత్రగణితం, సాంఖ్యకశాస్త్రం పేపరు-2గా ఉంటాయి.
  4.  ప్రతి సబ్జెక్టులో 80 శాతం మార్కులకు పబ్లిక్ పరీక్ష ఉంటుంది. మిగతా 20 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు ఉంటాయి.
  5.  పబ్లిక్ పరీక్షలో రెండు పేపర్లకు కలిపి 80 మార్కులకు గాను కనీసం 28 మార్కులు వస్తేనే పాస్. ఇంటర్నల్స్‌లో రెండు పేపర్లకు కలిపి కనీసం 7 మార్కులు రావాలి. అపుడే మొత్తం 35 శాతం మార్కులతో పాస్ అయినట్లు.
సబ్జెక్టు మొత్తం పబ్లిక్‌ పరీక్ష ఇంటర్నల్‌
ప్రథమభాష 100 80 20
ద్వితీయభాష 100 80 20
తృతీయభాష 100 80 20
గణితం-1 50 40 10
గణితం-2 50 40 10
భౌతికశాస్త్రం 50 40 10
జీవశాస్త్రం 50 40 10
సోషల్‌-1 50 40 10
సోషల్‌-1 50 40 10
మొత్తం 600 480 120
#NaaBadi #నాబడి #WorkSheets #RemedialTeaching #TeachingTechnics #AnnualPlan #UnitPlan #LessonPlan #OnlineTests #OnlineQuizes #E-Books #StudyMaterial #DepartmentalTests #GovtOrders #Proceedings #Results #Notifications #Admissions

0 comments:

Post a Comment